Telangana: ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతోంది: సీఎల్పీ నేత భట్టి వ్యాఖ్యలు

  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె
  • కేసీఆర్ ను నియంతగా పేర్కొన్న భట్టి
  • ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ వ్యాఖ్యలు

తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ ఓ నియంతలా పాలిస్తున్నారని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రజలు అండగా నిలవాలని భట్టి పిలుపునిచ్చారు.

More Telugu News