Guntur: ఇంటర్ బాలికతో పెళ్లి ... అత్యాచార కేసు పెట్టిన గుంటూరు పోలీసులు!

  • గుంటూరు జిల్లాలో ఘటన
  • మైనర్ బాలికకు ప్రేమ పేరిట మాయమాటలు
  • తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు

ఇంటర్ మీడియట్ చదువుతున్న ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి, పెళ్లి చేసుకుని, లొంగదీసుకున్న ఓ యువకుడిపై అత్యాచార కేసు నమోదైంది. ఈ ఘటన గుంటూరు, అరండల్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, విజయవాడ పరిధిలోని వెలగపూడికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. ఆమెకు గుంటూరు, కాకుమాను వారితోట ప్రాంతానికి చెందిన రసూల్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. బాలిక కూడా రసూల్ ను నమ్మింది. ఆపై పెళ్లికి ముందు, తరువాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయవాడలో బాలిక తండ్రి కిడ్నాప్ కేసు పెట్టగా, అక్కడి అధికారులు కేసును గుంటూరుకు బదిలీ చేశారు. బాలికను ట్రేస్ చేసి, ఆమె స్టేట్ మెంట్ ను నమోదు చేసుకున్న పోలీసులు, రసూల్ పై అత్యాచార కేసు నమోదు చేశారు.

More Telugu News