Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • నయనతార చిత్రం 'వసంతకాలం'
  • మరో చిత్రానికి నందిని రెడ్డి రెడీ 
  • మారుతి హిందీ సినిమా

*  నయనతార కథానాయికగా ఇటీవల తమిళంలో వచ్చిన 'కొలైయుతీర్ కాలం' చిత్రాన్ని 'వసంతకాలం' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో తెలుగు నాట రిలీజ్ చేస్తారు.
*  తాజాగా సమంతతో 'ఓ బేబీ' హిట్ చిత్రాన్ని రూపొందించిన నందిని రెడ్డి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని 'మహానటి' చిత్రాన్ని నిర్మించిన స్వప్న సినిమా అధినేత ప్రియాంక దత్ నిర్మిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  దర్శకుడు మారుతి బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. రెండేళ్ల క్రితం తన దర్శకత్వంలో వచ్చిన 'మహానుభావుడు' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్టు మారుతి తెలిపాడు. కాగా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ప్రతి రోజు పండగే' చిత్రం రూపొందుతోంది.

More Telugu News