Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ నేత సహా ఐదుగురి కాల్చివేత!

  • ఆదివారం రాత్రి ఘటన
  • ఇంట్లోకి ప్రవేశించి తుపాకులతో కాల్చిన దుండగులు
  • కేసును విచారిస్తున్న పోలీసులు

మహారాష్ట్రలోని జల్ గావ్ ప్రాంతంలో బీజేపీ నేతను, అతని నలుగురు కుటుంబ సభ్యులను ముగ్గురు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేటర్ రవీంద్ర ఖారత్ (55), ఆయన కుటుంబ సభ్యుల్లోని నలుగురిని దుండగులు హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.

 "గుర్తు తెలియని వ్యక్తులు రవీంద్ర ఖారత్ ఇంట్లోకి ప్రవేశించి, అతనితో పాటు, అతని సోదరుడు సునీర్ ఖారత్, కుమారులు రోహిత్, ప్రేమ్ సాగర్, దగ్గరి బంధువు సుమిత్ లను కాల్చి చంపారు. ఈ ఘటన భూసావల్ ప్రాంతంలోని ఖారత్ ఇంట్లోనే జరిగింది" అని స్థానిక ఎస్పీ పంజాబ్ రావ్ వుగాలే తెలిపారు.

ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయని, వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్, సాక్ష్యాధారాలను సేకరించింది. వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్యలు జరిగినట్టు అనుమానిస్తున్నామని, ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ఉగాలే వెల్లడించారు.

More Telugu News