CPI Ramakrishna: యురేనియం తవ్వకాల ప్రాంతాలలో గర్భిణులకు గర్భస్రావాలు జరుగుతున్నాయి: జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

  • యురేనియం తవ్వకాలను వెంటనే ఆపేయాలి
  • ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు
  • తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో రచ్చబండ నిర్వహించాలి

ఏపీలో జరుగుతున్న యురేనియం తవ్వకాలపై భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తవ్వకాలను వెంటనే ఆపాలని ప్రజలు, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, యురేనియం తవ్వకాలు జరుగుతున్న పులివెందుల ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో అఖిలపక్ష బృందం పర్యటించిందని లేఖలో తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని... గర్భిణులకు గర్భస్రావాలు కూడా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపాలని విన్నవించారు.

More Telugu News