Sye Raa Narasimha Reddy: 'సైరా' చిత్రంపై అనుష్క వ్యాఖ్యలు

  • చిరు, రామ్ చరణ్ లకు థ్యాంక్స్ చెప్పిన అనుష్క
  • రాణి లక్ష్మీబాయిగా నటించిన అనుష్క  
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో చిరస్మరణీయ చిత్రంగా చెప్పుకోదగిన సైరా నరసింహారెడ్డి మూవీ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్వీటీ అనుష్క  ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్ర పోషించింది. సైరాలో అనుష్క ఉందన్న విషయం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఎవరికీ తెలియదు. ఒకవిధంగా ఆమె పాత్ర అభిమానులకు ఓ సర్ ప్రైజ్ అని చెప్పాలి. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అనుష్క పాత్రకు గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో, అనుష్క సోషల్ మీడియాలో స్పందించింది.

మెగాస్టార్ చిరంజీవి తన పట్టుదల, అనుభవంతో సైరా నరసింహారెడ్డి పాత్రలో పరకాయప్రవేశం చేశారని, అలాంటి వ్యక్తి చిత్రంలో తాను కూడా నటించడాన్ని ఓ బాధ్యతగా భావించానని వివరించింది. సైరాలో తనను కూడా ఎంపిక చేసుకున్నందుకు చిరంజీవితో పాటు రామ్ చరణ్ కు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఓ నిర్మాతగా రామ్ చరణ్ ఎంతో గొప్పగా తీశాడని ప్రశంసించింది. ఈ బృహత్తరమైన ప్రయత్నంలో తనను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్స్ చెప్పింది.

More Telugu News