Telangana: ప్రభుత్వం కావాలనే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టింది: జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి

  • తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె
  • ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశం
  • ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని అశ్వత్థామరెడ్డి ఆరోపణ

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి స్పందించారు. ప్రభుత్వం కావాలనే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టిందని, ఆర్టీసీ ఆస్తులను దోచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీని మూసివేసేందుకు సర్కారు కుట్రలకు పాల్పడుతోందని, విమానాలపై ఉన్న శ్రద్ధ ఆర్టీసీపై లేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News