Vikarabad District: వికారాబాద్ జిల్లాలో కుప్పకూలిన శిక్షణ విమానం... ఇద్దరు మృతి

  • పంట పొలాల్లో నేలరాలిన విమానం
  • ప్రాణాలు కోల్పోయిన ట్రైనీ పైలెట్లు
  • వర్షం కారణంగా అదుపుతప్పిన విమానం

ఇద్దరు ట్రైనీ పైలెట్లతో గాల్లోకి లేచిన శిక్షణ విమానం వికారాబాద్ జిల్లా బంట్వారం వద్ద కుప్పకూలింది. వర్షం కారణంగా విమానం అదుపుతప్పి ఇక్కడి సుల్తాన్ పూర్ వద్ద పొలాల్లో నేలరాలింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలెట్లు ప్రకాశ్ విశాల్, అమన్ ప్రీత్ మృతి చెందారు. కాగా, ప్రమాదానికి ముందు ఈ విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ విమానానికి బేగంపేట ఏటీసీ నుంచి ఉదయం 11.55 గంటలకు సంబంధాలు తెగిపోయినట్టు గుర్తించారు.

More Telugu News