Tamilnadu: ప్రియుడిని హత్య చేసిన మరో ప్రియుడిని పోలీసులకు పట్టించిన ప్రియురాలు!

  • తమిళనాడులో ఘటన
  • హత్య కేసు విచారణలో వెల్లడైన నిజం
  • కుమార్తెపై కన్నేశాడని ప్రియుడిని పట్టించిన మహిళ

ఇదో ఆసక్తికరమైన క్రైమ్. వేధిస్తున్న తన ప్రియుడిని, మరో ప్రియుడితో హత్య చేయించిన ఓ మహిళ, అతన్ని పోలీసులకు పట్టించింది. హత్య తరువాత అతను తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతోనే తాను ఈ పని చేసినట్టు ఆమె పోలీసులకు వెల్లడించడం గమనార్హం.

తమిళనాడు, తిరువొత్తియూరు పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నామక్కల్ జిల్లా కుమారపాళయంకు చెందిన నేత కార్మికుడు వెంకటేశన్ (38) గత నెల 8న అదృశ్యమై, ఆపై కావేరీ నదిలో శవమై కనిపించాడు. పోలీసులు కేసును విచారిస్తున్న క్రమంలో సెల్వి, ఆమె ప్రియుడు పెరుమాళ్ ను ప్రశ్నించగా, ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.

భర్త నుంచి వేరుపడి ఓ కుమారుడు, కుమార్తెతో కలిసి జీవిస్తున్న సెల్వి, గత పదేళ్లుగా వెంకటేశన్ తో సహజీవనం చేస్తోంది. నిత్యమూ మందు తాగి వచ్చే వెంకటేశన్, చిత్రహింసలు పెడుతుండగా, అతని స్నేహితుడైన పెరుమాల్ అలియాస్ కుమార్ ఆమెకు పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్యా కూడా సంబంధం ఏర్పడింది. దీని గురించి తెలుసుకున్న వెంకటేశన్, నిలదీయగా, అతన్ని చంపాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగా అతనితో బాగా మద్యం తాగించి, కుమార్ అతనిని నదిలోకి తోసేశాడు. ఆపై పెరుమాళ్ తన కుమార్తెపై కన్నేశాడని, అందువల్లే అతన్ని పట్టించాలని నిర్ణయించుకున్నానని సెల్వి పోలీసుల విచారణలో వెల్లడించింది.

More Telugu News