India: మరో రెండు తీసిన అశ్విన్... భారత తొలి ఇన్నింగ్స్ లీడ్ 71 పరుగులు!

  • 431 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్
  • ఏడు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్
  • 46 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాతో విశాఖపట్నంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు 71 పరుగుల ఇన్నింగ్స్ లీడ్ ను సాధించింది. శుక్రవారం నాటికే ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న స్పిన్నర్ ఆశ్విన్, ఈ ఉదయం మరో రెండు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు 431 పరుగులకు ఆలౌటైంది. చివరి రెండు వికెట్లూ 46 పరుగుల వ్యవధిలో పడ్డాయి. నైట్ వాచ్ మెన్ కేశవ్ మహరాజ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో డబుల్ సెంచరీ వీరుడు మయాంక్ అగర్వాల్ కు క్యాచ్ ఇవ్వగా, రబడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మరికాసేపట్లో భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

More Telugu News