Godavari: ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద మూడు మృతదేహాలు... బోటు ప్రమాదంలో గల్లంతైన వారివిగా భావిస్తున్న అధికారులు

  • గోదావరిలో బోటు ప్రమాదం
  • గల్లంతైన పలువురు పర్యాటకులు
  • మృతదేహాలు ప్రభుత్వాసుపత్రికి తరలింపు

కొన్ని రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునక ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడడమే కాకుండా, అనేకమంది గల్లంతయ్యారు. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్దకు ఇవాళ మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఆ మృతదేహాలను వెలికితీయించిన అధికారులు జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. ఆ మృతదేహాలను బోటు ప్రమాదంలో గల్లంతైన వారివిగా భావిస్తున్నారు. బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాలను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం అవి ఎవరి మృతదేహాలన్నది గుర్తించే అవకాశాలున్నాయి. ఈ మేరకు గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించనున్నారు.

More Telugu News