SV Rangarao: తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరంజీవి

  • ఈ నెల 6న ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ
  • హాజరు కానున్న చిరంజీవి
  • అభిమానులు హాజరు కావాలని పిలుపు 

విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు విగ్రహాన్ని టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి ఆవిష్కరించనున్నారు. ఈ నెల 6న పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఈ కార్యక్రమం జరగనుంది. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్, కేఎస్ రోడ్ లో విగ్రహావిష్కరణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులందరూ హాజరుకావాల్సిందిగా అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఓ ప్రకటనలో కోరారు. 

More Telugu News