Huzurunagar: హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. ‘జనసేన’ మద్దతు కోరిన కాంగ్రెస్

  • రసవత్తరం కానున్న హుజూర్ నగర్ ఉపఎన్నిక
  • గెలుపు కోసం శతవిధాలా యత్నిస్తున్న కాంగ్రెస్
  • జనసేన నేతలను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉపఎన్నిక రసవత్తరం కానుంది. ఈ ఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ల మధ్యే ప్రధానపోరు జరగనుంది. ఇప్పటికే టీఆర్ఎస్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శతవిధాలా యత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హుజూర్ నగర్ ఉపఎన్నికలో తమకు మద్దతుగా నిలవాలని జనసేన పార్టీని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ విషయాన్ని జనసేన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) జనసేన నేతలను కలిసిన ఓ వీడియోను ఈ పోస్ట్ లో జతపరిచింది.

More Telugu News