India: వైజాగ్ టెస్ట్: ఓపెనర్ ఎల్గార్ సెంచరీ... ఎదురీదుతున్న సఫారీలు

  • తొలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా
  • 268/5 తో ఆడుతున్న దక్షిణాఫ్రికా
  • రాణించిన డుప్లెసిస్, డికాక్

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సఫారీలు పోరాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద టీమిండియా డిక్లేర్ చేయగా, బదులుగా దక్షిణాఫ్రికా జట్టు మూడో రోజు రెండో సెషన్ సమయానికి 5 వికెట్లకు 268 పరుగులు చేసింది. సఫారీ ఓపెనర్ డీన్ ఎల్గార్ పోరాటం నేడు కూడా కొనసాగింది.

రెండో రోజు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని వికెట్ కాపాడుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ మూడో రోజు ఆటలో చక్కని నైపుణ్యం కనబర్చాడు. ఎల్గార్ కు కెప్టెన్ డుప్లెసిస్ (55) నుంచి సహకారం లభించింది. డుప్లెసిస్ అవుటైనా వికెట్ కీపర్ డికాక్ రూపంలో ఎల్గార్ కు అండ లభించింది. డికాక్ సైతం ధాటిగా ఆడుతూ అర్థసెంచరీ పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం ఎల్గార్ 129 పరుగులతోనూ, డికాక్ 50 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ కు 3, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాకి చెరో వికెట్ లభించాయి.

More Telugu News