Tharun Bhaskar: 'మీకు మాత్రమే చెప్తా' రిలీజ్ డేట్ ఖరారు

  • వినోదభరిత చిత్రంగా 'మీకు మాత్రమే చెప్తా' 
  • ముఖ్యమైన పాత్రలో అనసూయ 
  • నవంబర్ 1వ తేదీన విడుదల

విజయ్ దేవరకొండ నిర్మాతగా 'మీకు మాత్రమే చెప్తా' రూపొందింది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ .. వాణి భొజన్ .. అభినవ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాకి షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా వ్యవహరించాడు.

పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకుంటున్నాయి. నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. మంచివాళ్లమనే పేరు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఆ ఇమేజ్ ను డామేజ్ చేసే చిన్నతప్పు జరిగినప్పుడు, దానిని సరిదిద్దుకునే క్రమంలో నుంచి పుట్టే కామెడీగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీ అవుతాడేమో చూడాలి.

More Telugu News