Gandhi: గాంధీ జయంతి సందర్భంగా తన పాదయాత్ర నాటి జ్ఞాపకాలను స్మరించుకున్న చంద్రబాబు

  • ఏడేళ్ల కిందట చంద్రబాబు పాదయాత్ర
  • ప్రజలందరినీ కలుసుకున్నానని ట్వీట్
  • కొన్ని అడుగులు కలిసి ప్రయాణించానంటూ వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో తాను చేసిన పాదయాత్ర తాలూకు జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఏడేళ్ల కిందట గాంధీ జయంతి నాడే తన పాదయాత్ర ప్రారంభించానని ట్విట్టర్ లో వెల్లడించారు. మహాత్ముడి స్ఫూర్తిగా 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర చేపట్టానని, 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో ప్రజలందరినీ కలుసుకున్నానని, వారి జీవనగమనంలో తాను కూడా కొన్ని అడుగులు కలిసి ప్రయాణించినందుకు జన్మ ధన్యమైందని భావిస్తున్నానని భావోద్వేగాలతో ట్వీట్ చేశారు. తన పాదయాత్ర ఫొటోలను కూడా చంద్రబాబు ట్వీట్ కు జోడించారు.

More Telugu News