Chiranjeevi: నిర్మాతగా చరణ్ చేతికి మరో భారీ ప్రాజెక్ట్

  • మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
  • మోహన్ లాల్ క్రేజ్ పెంచిన సినిమా 
  • తెలుగు హక్కులు చరణ్ చేతికి    

ఒక వైపున హీరోగా విభిన్నమైన చిత్రాలను చేస్తూనే, మరో వైపున నిర్మాతగా చరణ్ భారీ ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన 'సైరా' వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చరణ్ మరో భారీ ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'లూసిఫర్' అక్కడ ఘన విజయాన్ని దక్కించుకుంది. మోహన్ లాల్ స్థాయిని మరింతగా పెంచిన చిత్రంగా నిలిచింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ దక్కించుకున్నాడట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును కూడా ఆయన చిరంజీవితోనే చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News