Kanna: ఏపీలో పార్టీలే మారాయి... పాలన ఏం మారలేదు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు

  • వైసీపీది దిగజారుడు సంస్కృతి అంటూ వ్యాఖ్యలు
  • కన్నాను రౌడీ అని సంబోధించారంటూ ఆగ్రహం  
  • కన్నా లేఖలకు ఎందుకు బదులివ్వలేదని నిలదీత 

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఎన్నో లేఖలు రాశారని, వాటికి బదులివ్వకుండా ఆయనపైనే తిరిగి వ్యక్తిగత విమర్శలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణను ప్రసన్నకుమార్ ఓ రౌడీ అని సంబోధించడం వైసీపీ దిగజారుడు రాజకీయ సంస్కృతికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. కన్నా గతంలో వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఇప్పటి వైసీపీ నేతలు మర్చిపోయారని అన్నారు.

"ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కన్నా, మేం మీలాగా దిగజారుడు వ్యాఖ్యలు చేయలేం" అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు టీడీపీ అవినీతిపరులపై చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏపీలో టీడీపీ పాలన తరహాలోనే వైసీపీ పాలన కూడా సాగుతోందని, పార్టీలు మారాయే తప్ప పాలన ఏం మారలేదని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.

More Telugu News