BJP: బీజేపీ ఎంపీ జీవీఎల్ కు మాతృవియోగం... సంతాపం తెలిపిన కన్నా

  • జీవీఎల్ మాతృమూర్తి చౌడేశ్వరి కన్నుమూత
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కన్నా
  • ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు మాతృవియోగం కలిగింది. జీవీఎల్ తల్లి చౌడేశ్వరి ఇవాళ కన్నుమూశారు. జీవీఎల్ కు మాతృవియోగం కలిగిందన్న విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కన్నా తన సంతాపం తెలియజేశారు. జీవీఎల్ మాతృమూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో జీవీఎల్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

More Telugu News