anupama parameshwaran: నంద్యాలలో సినీ నటి అనుపమ సందడి.. చూసేందుకు ఎగబడిన అభిమానులు

  • చందన బ్రదర్స్ షోరూంను ప్రారంభించిన నటి
  • అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపిన అనుపమ
  • ఆఫర్లను వినియోగించుకోవాలని సూచన

టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ ఆదివారం నంద్యాలలో సందడి చేసింది. ప్రముఖ వస్త్ర దుకాణ సంస్థ చందన బ్రదర్స్ తన 65వ షోరూంను పట్టణంలో ఏర్పాటు చేసింది. ఈ షోరూం మొదటి అంతస్తులో వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, రెండో అంతస్తులో చీరలు, మూడో అంతస్తులో రెడీమేడ్ వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ షోరూంను ఆదివారం నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించింది. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అనుపమను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరితో ఆమె సెల్ఫీలు దిగారు. అనంతరం మాట్లాడుతూ.. తొలుత అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా సందర్భంగా షోరూంలో నగలు, వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్‌లు ఇస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

More Telugu News