Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాశిఖన్నా మరో పాట పాడిందట! 
  • నిర్మాతగా చిరంజీవి పెద్దల్లుడు 
  • ఎట్టకేలకు నిఖిల్ సినిమా విడుదల 

*  అందాలతార రాశిఖన్నా మంచి గాయని అన్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని సినిమాలలో ఆమె పాటలు కూడా పాడింది. ఈ క్రమంలో తాజాగా 'ఊరంతా అనుకుంటున్నారు' సినిమాలో మరో పాటను పాడిందట. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియాలో పేర్కొంది. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల అవుతోంది.
*  మెగాస్టార్ చిరంజీవి పెద్ద అల్లుడు కె.ఎల్. విష్ణుప్రసాద్ నిర్మాతగా మారుతున్నారు. చిరంజీవి పెద్ద కూతురు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. అయితే, ముందుగా నేటి ట్రెండ్ అయిన వెబ్ సీరీస్ నిర్మిస్తారని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.
*  నిఖిల్ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ సురవరం' చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని హీరో నిఖిల్ పేర్కొన్నాడు. త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపాడు.

More Telugu News