Telangana: తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు

  • గోదావరిఖనిలో ‘మత్స్యవీర’ పేరుతో పోటీలు
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు
  • పలు జిల్లాల నుంచి 200 మంది పాల్గొనే అవకాశం

తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. గోదావరిఖనిలోని గోదావరి నదిలో ‘మత్స్యవీర’ పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించే పోటీల్లో పాల్గొనే మత్స్యకారులకు బహుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 200 మంది పాల్గొనే అవకాశం ఉంది.    

More Telugu News