Jagan: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహనం సేవలో పాల్గొననున్న సీఎం జగన్

  • సోమవారం చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు
  • మంగళవారం విజయవాడ రాక

ఏపీ సీఎం జగన్ సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జగన్ రేణిగుంట చేరుకుంటారు. పర్యటనలో భాగంగా మొదట తిరుచానూరులో పద్మావతి నిలయం వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. ఆపై అలిపిరి-చెర్లోపల్లి మధ్య రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేరోజు సాయంత్రం ఐదింటికి తిరుమల చేరుకుంటారు.

 తిరుమలలో వకుళాదేవి వసతిగృహానికి శంకుస్థాపన చేసి, అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి 8 గంటలకు నిర్వహించే పెద్దశేష వాహనం సేవలో కూడా సీఎం పాల్గొంటారు. సోమవారం రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేయనున్న జగన్, మంగళవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట నుంచి విజయవాడ తిరిగి వెళతారు.

More Telugu News