Article 370: ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్ల విచారణ... ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు

  • కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన కేంద్రం
  • కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు
  • అక్టోబరు 1 నుంచి విచారణ ప్రారంభించనున్న రాజ్యాంగ ధర్మాసనం

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన దరిమిలా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనేకమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ కోసం ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం అక్టోబరు 1 నుంచి పిటిషన్లపై విచారణ జరపనుంది.

More Telugu News