Varun tej: ఎక్కడికెళ్లినా 'గద్దలకొండ గణేశ్' అనే పిలుస్తున్నారు: వరుణ్ తేజ్

  • పెదనాన్న ప్రోత్సాహంతో చేశాను 
  • ఆయన చెప్పినట్టుగానే జరిగింది 
  • తమ కష్టం ఫలించిందన్న వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన 'గద్దలకొండ గణేశ్' మాస్ ఆడియన్స్ మనసులను దోచేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా విజయ విహారం చేస్తోంది. తొలివారం రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17.56 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 20.31 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఈ సినిమాకి ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. నేను ఎక్కడికి వెళ్లినా అంతా 'గద్దలకొండ గణేశ్' అనే పిలుస్తున్నారు. ఈ పాత్ర ఇంతగా జనంలోకి వెళ్లడం సంతోషాన్నిస్తోంది. చిరంజీవిగారికి కథ చెప్పి .. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ సినిమా చేశాను. ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమా .. ఈ పాత్ర నాకు మరింత గుర్తింపును తీసుకొచ్చాయి. నేను .. హరీశ్ శంకర్ పడిన కష్టానికి ఫలితం దక్కింది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News