Allu Arjun: 'అల వైకుంఠపురములో' నుంచి 'సామజవరగమన' సాంగ్

  • షూటింగు దశలో త్రివిక్రమ్ మూవీ 
  • బన్నీ జోడీగా పూజా హెగ్డే 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక సాంగ్ ను వదిలారు. 'సామజవరగమన .. నిను చూసి ఆగగలనా .. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా' అంటూ ఈ పాట సాగుతోంది.

నాయకుడు .. నాయకి వెంటపడుతూ, ఆమె పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాటగా ఇది అనిపిస్తోంది. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారింది. సొగసైన అర్థాలు వచ్చే పదునైన పద ప్రయోగాలు చేస్తూ ఆయన పాటను అందించారు. తమన్ బాణీ .. సిద్ శ్రీరామ్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. 'టబు' కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతిని విడుదల చేయనున్నారు.

More Telugu News