Indonesia: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం... 20 మంది మృతి

  • మాలుకు ప్రావిన్స్ లో భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత నమోదు
  • పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు

పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించి ఉన్న ఇండోనేషియా దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. మాలుకు ప్రావిన్స్ లో 6.5 తీవ్రతతో భూకంపం రావడంతో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. చాలాచోట్ల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపం ధాటికి 20 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. తీవ్రస్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

More Telugu News