PVNR Express Way: పిల్లర్ నంబర్ 20 వద్ద డ్యామేజ్.. చర్యలు తీసుకోండి: కేటీఆర్ కు కోన వెంకట్ ట్వీట్

  • పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేకు డ్యామేజ్
  • ఫొటోలను షేర్ చేసిన కోన వెంకట్
  • ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని విన్నపం

సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ కు సామాజిక బాధ్యత ఎక్కువనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఎన్నో అంశాలపై బాధ్యత గల పౌరుడిగా ఆయన స్పందించారు. తాజాగా ఓ ప్రమాదకర అంశాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 20 వద్ద డ్యామేజ్ అయింది. ప్రమాదకరంగా మారిన ఈ విషయాన్ని కేటీఆర్, జీహెచ్ఎంసీ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకముందే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు. దీనికి సంబంధించి ఫొటోలను షేర్ చేశారు.

More Telugu News