Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పారితోషికం పెంచేసిన పూజ హెగ్డే 
  • మళ్లీ వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్'
  • విజయ్ సేతుపతికి ఐదు కోట్లు!

*  తాజాగా 'వాల్మీకి' చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెప్పించిన కథానాయిక పూజ హెగ్డే తన పారితోషికాన్ని ఇప్పుడు బాగా పెంచేసిందట. తెలుగులో తనకు డిమాండ్ ఎక్కువ కావడంతో రెండు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు ట్రేడ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం మంచి హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయాలని నిర్మాతలు పూరి, ఛార్మి నిర్ణయించారు. ఈ నెల 27న తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన పది థియేటర్లలో దీనిని రిలీజ్ చేస్తారు.  
*  తమిళనాట బిజీ హీరోగా రాణిస్తున్న విజయ్ సేతుపతి 'సైరా' సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రంలో కూడా విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందుకు గాను ఆయనకు 5 కోట్లు పారితోషికంగా ఇస్తున్నట్టు సమాచారం.

More Telugu News