Guntur District: సీఎం జగన్ కు లింగమనేని రమేశ్ లేఖ

  • మా ఇంటిని కూల్చేస్తారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి 
  • అన్ని నిబంధనల మేరకే ఆ ఇంటిని నిర్మించా
  • బాధ్యత గల పౌరుడిగా చంద్రబాబుకు నా ఇల్లు ఇచ్చాను

ఏపీ సీఎం జగన్ కు లింగమనేని రమేశ్ ఓ లేఖ రాశారు. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న తమ ఇంటిని కూల్చివేస్తారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాక, అన్ని నిబంధనల మేరకే ఆ ఇంటిని నిర్మించామని తెలిపారు. దీనిపై గతంలోనే సీఆర్డీఏ అధికారులకు వివరణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. బాధ్యత గల ఓ పౌరుడిగానే చంద్రబాబుకు తన ఇంటిని ఇచ్చానని, తనను చంద్రబాబు బినామీగా పేర్కొంటూ ప్రచారం జరుగుతోందని, తన కుటుంబాన్ని మానసిక వ్యథకు గురిచేస్తున్నారని ఆ లేఖలో రమేశ్ వాపోయారు.

More Telugu News