Hyderabad: అమీర్ పేట మెట్రో ప్రమాదంపై విచారణ ప్రారంభం

  • మెట్రో స్టేషన్ వద్ద సిమెంటు పెచ్చులు పడి వివాహిత మృతి
  • ఘటన స్థలాన్ని పరిశీలించిన మెట్రో సేఫ్టీ కమిషనర్
  • విచారణలో పాలుపంచుకుంటున్న హైదరాబాద్ ఐఐటీ నిపుణులు

ఇటీవల హైదరాబాద్ లోని అమీర్ పేట మెట్రో రైల్వే స్టేషన్ వద్ద పైనుంచి సిమెంటు పెచ్చులు ఊడి మీద పడడంతో మౌనిక అనే వివాహిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో మెట్రో స్టేషన్ల పటిష్టతపై సందేహాలు తలెత్తాయి. కాగా, ఈ ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభమైంది. ప్రమాదం జరిగిన స్థలాన్ని మెట్రో సేఫ్టీ కమిషనర్, ఇంజినీరింగ్ నిపుణులు పరిశీలించారు. ఈ విచారణలో హైదరాబాద్ ఐఐటీ నిపుణుల సాయం తీసుకుంటున్నారు.

More Telugu News