Hrithik Roshan: ఆ సినిమాకి శ్రద్ధా కపూర్ 11 కోట్లు అడిగిందట!

  • అల్లు అరవింద్ నిర్మాతగా 'రామాయణ'
  • శ్రీరాముడి పాత్రలో హృతిక్ రోషన్ 
  • 3 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు

హిందీలో కథానాయికగా శ్రద్ధా కపూర్ కి మంచి క్రేజ్ వుంది. తెలుగు తెరకి 'సాహో' సినిమా ద్వారా పరిచయమైన ఈ సుందరికి ఇక్కడ కూడా ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి చేతిలో భారీ బాలీవుడ్ ప్రాజెక్టులు వున్నాయి. ఈ నేపథ్యంలోనే 'రామాయణ' సినిమాలో సీత పాత్ర కోసం శ్రద్ధా కపూర్ ను అడిగినట్టుగా తెలుస్తోంది. అల్లు అరవింద్ ఒక నిర్మాతగా, నితీశ్ తివారి .. రవి ఉద్యవార్ దర్శకత్వంలో 'రామాయణ' రూపొందనుంది. 3 భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ సినిమాలో శ్రీరాముడిగా హృతిక్ రోషన్ ను .. సీతాదేవిగా దీపికా పదుకొనేను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన దీపిక కుదరదని చెప్పిందట. దాంతో దర్శక నిర్మాతలు శ్రద్ధా కపూర్ ను సంప్రదించగా, పారితోషికంగా 11 కోట్లు ఇవ్వమని అడిగిందట. దాంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడినట్టుగా సమాచారం. 3 భాగాలకు కలుపుకుని శ్రద్ధా కపూర్ ఈ పారితోషికం అడిగిందా? లేదంటే ఒక భాగానికే ఇంత డిమాండ్ చేసిందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.

More Telugu News