Chiranjeevi: 'సైరా'లో మేజర్ హైలైట్ సీన్ ఇదేనట

  • చిరంజీవి 151వ చిత్రంగా 'సైరా'
  • దర్శకుడిగా సురేందర్ రెడ్డి 
  • ఒకే రోజున 5 భాషల్లో విడుదల 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. చరణ్ నిర్మాణంలో 'సైరా' నిర్మితమైంది. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్తగా ఒక పోస్టర్ ను వదిలారు.

ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే ఒక సన్నివేశానికి సంబంధించిన సమాచారాన్ని ఈ పోస్టర్ ద్వారా ఇచ్చారు. నోస్సం ఫోర్ట్ నేపథ్యంలోని యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. దేశ విదేశాలకి చెందిన ఆర్టిస్టులు .. ఫైటర్స్ కలుపుకుని 2000 మందితో, 35 రాత్రుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా చిత్రీకరించినట్టుగా చెప్పారు. రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సన్నివేశం ఉంటుందని చెబుతున్నారు. ఈ సన్నివేశంలో మెగాస్టార్ ఏ స్థాయిలో విజృంభించారో చూడాలి మరి.

More Telugu News