Donald Trump: కలిసి పనిచేస్తామని చెప్పి ఒక్క రోజైనా గడవకముందే భారత్‌కు షాకిచ్చిన ట్రంప్

  • హ్యూస్టన్ సభలో భారత్‌పై ప్రేమ కనబరిచిన ట్రంప్
  • ఇమ్రాన్‌తో సమావేశంలో కశ్మీర్ అంశం ప్రస్తావన
  • ఇరు దేశాలు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి రెడీ అన్న ట్రంప్

భారత్-అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకు కలిసి పనిచేస్తామని హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమంలో చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే భారత్‌కు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ట్రంప్ గతంలోనూ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. సోమవారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం చేయగల సమర్థత తనకు ఉందని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు.

More Telugu News