Andhra Pradesh: కేసీఆర్ తో ముగిసిన జగన్ భేటీ

  • ప్రగతిభవన్ లో సీఎంలు కేసీఆర్, జగన్ ల సమావేశం
  • సుమారు నాలుగు గంటలు కొనసాగిన భేటీ
  • రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై చర్చ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో సీఎంలు కేసీఆర్, జగన్ ల భేటీ సుమారు నాలుగు గంటలు కొనసాగింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపైన, విభజన చట్టం 9,10 షెడ్యూల్ లోని సంస్థలపైన చర్చించినట్టు సమాచారం. రాజకీయ అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News