Rajyalakshmi: ఓ సీనియర్ ఆర్టిస్ట్ నన్ను చెంపదెబ్బ కొట్టింది: 'శంకరాభరణం' రాజ్యలక్ష్మి

  • సీనియర్ ఆర్టిస్టులతో పనిచేశాను 
  • గుడ్ మార్నింగ్ చెప్పలేదనేది ఆమె కోపం
  • సారీ చెప్పకపోవడం బాధ కలిగించిందన్న రాజ్యలక్ష్మి

'శంకరాభరణం' సినిమాతో రాజ్యలక్ష్మి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన రాజ్యలక్ష్మి, టీవీ సీరియల్స్ లోను నటిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించాను. కానీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ ధోరణి మాత్రం నాకు చాలా బాధ కలిగించింది.

నన్ను చెంపదెబ్బ కొట్టవలసిన ఒక సన్నివేశంలో నిజంగానే కొట్టేసింది .. పైగా సారీ కూడా చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె కోపంతోనే కొట్టిందనే విషయం దర్శకుడికి కూడా అర్థమైపోయింది. ఆమె అలా ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదు. ఆ రోజు సెట్ కి రాగానే ఆమెకి గుడ్ మార్నింగ్ చెప్పకపోవడం వల్లనే నన్ను కొట్టిందనే విషయం ఆ తరువాత ఆమె మాటల వలన నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News