Telangana: ముఖ్యమంత్రుల భేటీ.. జగన్ కి సాదర ఆహ్వానం పలికిన కేసీఆర్

  • ప్రగతిభవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం
  • జగన్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసిన కేసీఆర్
  • సమావేశంలో పాల్గొన్న రెండు రాష్ట్రాల అధికారులు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, సీఎం కేసీఆర్ లు ఈ రోజు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసిన కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేత వినోద్ తదితరులు ఉన్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

More Telugu News