Maharashtra: బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కూతుళ్లు

  • మహారాష్ట్ర, మాలేగావ్‌లోని బుల్దాన్‌ ప్రాంతంలో విషాదం 
  • ఈ రోజు మృతదేహాలను గుర్తించిన స్థానికులు 
  • హత్యలా? ఆత్మహత్యలా అన్న సందేహాలు

మహారాష్ట్రలోని మాలేగావ్‌లోని బుల్దాన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ, తన నలుగురు కూతుళ్లతో కలిసి బావిలో శవాలుగా తేలగా ఈ రోజు ఉదయం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాలను వెలికి తీశారు. నిన్న ఈ సంఘటన జరిగిందని భావిస్తుండగా, తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా వారిని చంపి బావిలో పడేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News