Jagan: నేడు ప్రగతి భవన్ కు రానున్న వైఎస్ జగన్... కేసీఆర్ తో చర్చలు!

  • పలు అంశాలపై ఇద్దరి మధ్యా చర్చలు
  • ఆస్తులు, అప్పుల పంపకంపై కీలక నిర్ణయాలు
  • పాల్గొననున్న అధికారులు

తెలుగు రాష్ట్రాల సీఎంలు నేడు మరోసారి కలుసుకోనున్నారు. ఈ ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, మధ్యాహ్నం తరువాత హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు రానున్నారు. అక్కడే కేసీఆర్, జగన్ ల మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. విభజన చట్టంలో నెలకొన్న సమస్యలపై, జల వనరుల సద్వినియోగం, ఏపీకి రావాల్సిన పెండింగ్ విద్యుత్ బకాయిలు, 9, 10వ షెడ్యూల్ లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకం వంటి అంశాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంల భేటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.

More Telugu News