New Delhi: విజయవాడ విమానానికి పిడుగుపాటు.. గాల్లో ఊగిన విమానం.. సిబ్బందికి గాయాలు

  • నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన విమానం
  • భారీ వర్షం, ఉరుములు, మెరుపులు
  • గన్నవరంలో క్షేమంగా ల్యాండైన విమానం

ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిరిండియా విమానం పిడుగు ప్రభావానికి  గురైంది. ఫలితంగా గాల్లో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది కొందరు గాయపడ్డారు. ఎయిరిండియాకు చెందిన విమానం నిన్న సాయంత్రం 7:28 గంటలకు ఢిల్లీలో బయలుదేరింది. రాత్రి 9:40 గంటలకు ఈ విమానం గన్నవరం చేరుకోవాల్సి ఉంది.

విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం ప్రారంభమైంది. విమానంపై పిడుగు పడకున్నా ఆ ప్రభావం మాత్రం విమానంపై పడింది. దీంతో  విమానం గాల్లో ఊయలలా అటూఇటూ ఊగిపోయింది. ప్రయాణికులకు భయభ్రాంతులు గురయ్యారు. ప్రయాణికులు గాయపడకపోయినప్పటికీ కొందరు సిబ్బంది మాత్రం గాయపడ్డారు. విమానం గన్నవరంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.  

More Telugu News