Sivaprasad: తిరుపతి చేరుకున్న శివప్రసాద్ భౌతికకాయం...భారీగా తరలివస్తున్న టీడీపీ శ్రేణులు

  • అనారోగ్యంతో కన్నుమూసిన శివప్రసాద్
  • ఎన్జీవో కాలనీ నివాసానికి చేరుకున్న శివప్రసాద్ భౌతికకాయం
  • ఎల్లుండి అంత్యక్రియలు

అనారోగ్యంతో మరణించిన టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతికకాయం చెన్నై నుంచి తిరుపతి తరలించారు. భారీ కాన్వాయ్ వెంట రాగా శివప్రసాద్ భౌతికకాయాన్ని ఈ సాయంత్రం చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. ఆయన మరణవార్త తెలియగానే టీడీపీ శ్రేణులు తిరుపతి ఎన్జీవో కాలనీలోని ఆయన నివాసం వద్దకు భారీగా తరలి వచ్చాయి. శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం అగరాలలో సోమవారం నిర్వహిస్తారు.

More Telugu News