Godavari: కచ్చలూరు ప్రమాదం మరువకముందే గోదావరిలో ప్రత్యక్షమైన మరో బోటు!

  • బోటును నిలిపివేసిన పోలీసులు
  • పోలీసుల అదుపులో ఇద్దరు డ్రైవర్లు  
  • బోటులో దేవీపట్నం తహసీల్దార్ బంధువులు!

ఇటీవల తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో ఎంతటి స్థాయిలో బోటు ప్రమాదం జరిగిందో తెలిసిందే. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు సుడిగుండం కారణంగా మునిగిపోగా, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మరువకముందే గోదావరిలో దేవీపట్నం వద్ద ఓ బోటు ప్రయాణిస్తూ దర్శనమిచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే ఆ బోటును నిలిపివేసి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ బోటులో దేవీపట్నం తహసీల్దార్ బంధువులు ఉన్నట్టు గుర్తించారు. తహసీల్దార్ తన బంధువుల కోసం బోటు పంపినట్టు తెలుస్తోంది.

More Telugu News