Sivaprasad: టీడీపీ నేత శివప్రసాద్ మృతికి సీఎం జగన్ సంతాపం

  • అనారోగ్యంతో కన్నుమూసిన టీడీపీ నేత శివప్రసాద్
  • స్పందించిన సీఎం జగన్
  • శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

తెలుగుదేశం పార్టీ వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నాయకులను కోల్పోయింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించగా, మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలో చికిత్స పొందుతూ శివప్రసాద్ తుదిశ్వాస విడిచారు. టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. మాజీ ఎంపీ, మాజీ మంత్రి శివప్రసాద్ మృతి పట్ల సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శివప్రసాద్ మృతికి సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

More Telugu News