Crime News: విజయవాడలో యువకుడి దారుణ హత్య

  • బండరాయితో మోది ఘాతుకం
  • అరండల్‌పేటలో ఘటన
  • పాత కక్షలే కారణమై ఉంటాయని భావన

విజయవాడ పట్టణంలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని అరండల్‌పేట ప్రాంతం ఉర్దూ స్కూల్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మంగింశెట్టి మనోజ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బండరాయితో తలపై బలంగా మోదారు. దీంతో మనోజ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలానికి కారణమైంది. రెండు వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షల నేపథ్యంలో మనోజ్‌ను హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News