Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అఖిల్ షూటింగులో చేరిన పూజా హెగ్డే
  • నాగశౌర్య కొత్త చిత్రం 'మూగమనసులు' 
  • డబ్బింగ్ మొదలెట్టిన బాలకృష్ణ  

  *  టాప్ హీరోయిన్ గా బిజీగా వున్న పూజా హెగ్డే తాజాగా అఖిల్ అక్కినేని సరసన నటించడానికి ఓకే చెప్పింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగులో నిన్న ఆమె జాయిన్ అయింది.
*  నాగ శౌర్య కథానాయకుడుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'మూగమనసులు' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
*  నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం తొలి షెడ్యూలు పూర్తయింది. దీంతో ఈ షెడ్యూలులో చిత్రీకరించిన భాగానికి బాలకృష్ణ డబ్బింగ్ చెప్పడం నిన్న మొదలుపెట్టారట. ఇందులో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.   

More Telugu News