Andhra Pradesh: ఏపీపీఎస్సీ ఆఫీసు ముందు ‘తెలుగు యువత’ ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • కాకరేపుతున్న గ్రామ సచివాలయం ఉద్యోగాల గొడవ
  • పేపర్ లీక్ అయిందని మీడియాలో వార్తలు
  • పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలుగు యువత డిమాండ్

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయం పరీక్ష ప్రశ్నాపత్రం ముందుగానే లీకైనట్లు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ‘తెలుగు యువత’ నేతలు, కార్యకర్తలు ఈరోజు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ప్రశ్నాపత్రం లీకైందని ఆరోపించారు. కాబట్టి వెంటనే పరీక్షలను రద్దుచేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం, ఇతర కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం రాజ్ భవన్ సమీపంలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు వారిని తరలించారు.

More Telugu News