Tirumala: కోనేటిరాయుడుకు రూ.కోటి విరాళం.. హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ కానుక

  • ఈరోజు ఉదయం స్వామిని దర్శించుకున్న శివనాడార్‌
  • దర్శనానంతరం ట్రస్ట్‌ బోర్డుకు వితరణ
  • వేదాశీర్వచనం పలికిన అర్చకులు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కోనేటిరాయుడుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. స్వామిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న శివనాడార్‌ శ్రీవారి ట్రస్ట్‌ బోర్డుకు ఈ విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో నాడార్‌ను సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

More Telugu News