Pawan Kalyan: పవన్ ఆగ్రహానికి దిగి వచ్చిన ట్విట్టర్!

  • 400 మంది జనసేన కార్యకర్తల అకౌంట్లను బ్లాక్ చేసిన ట్విట్టర్
  • ప్రజల తరపున నిలబడితే ఖాతాలను సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించిన పవన్
  • సస్పెండ్ చేసిన ఖాతాలను పునరుద్ధరించిన ట్విట్టర్

జనసేన మద్దతుదారులకు సంబంధించిన దాదాపు 400 అకౌంట్లను ట్విట్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ పై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సహాయులైన ప్రజల తరపున నిలబడినందుకే ఈ ఖాతాలను సస్పెండ్ చేశారా? అని ట్విట్టర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ట్విట్టర్ చర్యలను ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. సస్పెండ్ చేసిన ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పవన్ రియాక్షన్ కు ట్విట్టర్ యాజమాన్యం దిగివచ్చింది. సస్పెండ్ చేసిన ఖాతాలను పునరుద్ధరించింది.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ కు పవన్ ధన్యవాదాలు తెలిపారు. 'వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించినందుకు, జనసేన కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించే విషయంలో వేగంగా ప్రతిస్పందించినందుకు ట్విట్టర్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News