Jammu And Kashmir: కశ్మీర్ లో 273 మంది ఉగ్రవాదులు.. హై అలర్ట్

  • హెచ్చరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు
  • ఉత్తర కశ్మీర్ లో 96, దక్షిణ కశ్మీర్ లో 158, మధ్య కశ్మీర్ లో 19 మంది ముష్కరులు
  • అప్రమత్తమైన భద్రతాబలగాలు

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. మరోవైపు, జమ్మూకశ్మీర్లో 273 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దాడులకు పాల్పడటం ద్వారా, అలజడులు సృష్టించేందుకు ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు యత్నిస్తున్నారని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కశ్మీర్ లో 96, దక్షిణ కశ్మీర్ లో 158, మధ్య కశ్మీర్ లో 19 మంది ముష్కరులు ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ నేపథ్యంలో, భారత భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం వేటను ప్రారంభించాయి.

More Telugu News