East Godavari: బోటు ప్రమాద ఘటన.. హర్షకుమార్ ఆరోపణలను ఖండించిన జిల్లా ఎస్పీ!

  • మంత్రి అవంతి శ్రీనివాస్ నాకు ఫోన్ చేయలేదు
  • బోటును అనుమతించేందుకు నాపై ఒత్తిడి చేయలేదు
  • ఎస్ఐపై నేను ఒత్తిడి చేయలేదు

తూర్పుగోదావరి జిల్లా బోటు ప్రమాద ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన ఆరోపణలను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీంహష్మి ఖండించారు. ఆ బోటుకు అనుమతి నిమిత్తం కలెక్టర్, ఎస్పీలకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేసి ఒత్తిడి చేశారన్న ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. అవంతి శ్రీనివాస్ నుంచి తనకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని, ఆ బోటును అనుమతించాలని ఎస్ఐ పై తాను ఎలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.

More Telugu News